ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో దారుణం.. ప్రత్యర్థిని చంపి ఇన్‌స్టాలో రీల్స్ చేసిన యువకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 06:03 PM

హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు కిరాతకంగా హత్య చేశారు. వెంటాడి వెంటాడి కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం అతడిని చంపిన కత్తులతో ఇన్‌స్టా రీల్స్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచపల్లి ప్రగతినగర్ చెరవు కట్టపై సిద్ధూ అనే వ్యక్తిని ఇద్దరు యువకులు వెంటాడి మరీ దారణంగా హతమార్చారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. హత్య అనంతరం దుండగులు ఇన్‌స్టా‌గ్రామ్‌లో రీల్స్ చేశాడు. సిద్ధూనే తామే చంపేశామంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు.


స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకొని.. ఇన్‌స్టా రీల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు పాత కక్షలే అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. గతంలో సిద్దూ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే సిద్దూ హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిందితులు దొరికిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa