ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో 4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లోనే, ఎల్లో అలర్ట్ జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 09, 2024, 06:22 PM

తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కుబురు చెప్పింది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతోపాటు వడగాలులు వీస్తాయన్నారు. ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. నేడు మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఈ జిల్లాలతో పాటు కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో శుక్రవారం వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు.


తెలంగాణలో ఎండలు, వేడి గాలులు.. ప్రజలకు బిగ్ అలర్ట్


దాదాపు రెండు వారాల తర్వాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత రెండు వారాలుగా 44 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పడిపోయాయి. హైదరాబాద్‌లో సోమవారం 40 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యయాయి. సాయంత్రం చల్లని గాలులు వీయటంతో నగరవాసులు ఉపశమనం పొందారు. నేడు కూడా నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa