ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ అలర్ట్.. టైమింగ్స్ మార్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 07:27 PM

లోక్ సభ ఎన్నికల వేళ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటికే పోలింగ్ కోసం ఇప్పటికే నగరంలో ఉంటే ఓటర్లంతా సొంత గ్రామాలకు వెళ్లారు. దీంతో.. నగరం చాలా వరకు ఖాళీగా కనిపిస్తోంది. అయితే.. ఓటు హక్కు వినియోగించుకుని మళ్లీ జనాలంతా హైదరాబాద్ బాట పట్టనున్నారు. మంగళవాళం (మే 14న) ఉదయం మళ్లీ యథావిధిగా కార్యాలయాల్లో విధులకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో.. వేకువజామునే నగరానికి చేరుకునేలా ప్రయాణికులు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.


సాధారణంగా హైదరాబాద్ మెట్రో సాధారణంగా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుండగా.. మే 14వ తేదీన మాత్రం ఉదయం 5 గంటల 30 నిమిషాలకే సేవలు ప్రారంభించనున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యమే తమ ప్రాధాన్యత అని తెలిపిన హైదరాబాద్ యాజమాన్యం.. వేకువజామున నగరానికి వచ్చే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు... ముందే సేవలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. దీంతో.. వేకువజామున నగరానికి చేరుకునే ప్రయాణికులు.. ఏ క్యాబో, ఆటోనో మాట్లాడుకుని వందలకు వందలు ఖర్చు చేయకుండా మెట్రో సేవలను వినియోగించుకునే అవకాశం దొరికింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa