ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కవిత బెయిల్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. మే 28న ఏం జరగనుంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 07:06 PM

దేశంలో సంచలనం సృష్టిస్టోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అరెస్టయి.. జ్యుడీషల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించగా.. ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా.. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేట్టింది.


ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసిన ఈడీ.. తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ధర్మాసనానికి తెలిపింది. అయితే సీబీఐ మాత్రం.. కౌంటర్ దాఖలుకు గడువు కోరింది. బెయిల్‌పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 7న ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో.. బెయిల్ పిటిషన్ విచారణను మే 27కు వాయిదా వేసింది హైకోర్టు.


ఇదిలా ఉంటే ఈ కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ మోపిన అభియోగాలపై కవిత తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇచ్చారు. కాగా.. ఆదివారం (మే 26 తేదీ) సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.


ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు సీబీఐ కూడా కవితపై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కవితకు బెయిల్ దొరుకుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అందులోనూ.. ఈ నెల 27, 28 తేదీల్లో ఏం జరగనుందని బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa