ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది బీజేపీలోనే సాధ్యం: కిషన్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 09:21 PM

బీజేపీలో సాధరణ కార్యకర్తకు కూడా గుర్తింపు ఓటుందని, సాధారణ కార్యకర్తలకు కూడా కేంద్రమంత్రి పదవులు రావడం కేవలం తమ పార్టీలోనే సాధ్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీ కార్యకర్తలు మండుటెండలను కూడా లెక్క చేయకుండా పార్టీ గెలుపు కోసం... అభ్యర్థుల గెలుపు కోసం పని చేశారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులు అయిన తాను, బండి సంజయ్, శ్రీనివాసవర్మ మొదటి నుంచి పార్టీ కోసం పని చేశామని... సిద్ధాంతమే ఊపిరిగా బతికామన్నారు. సాధారణ కార్యకర్తలకు కేంద్రమంత్రి పదవులు రావడం గర్వంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa