తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల్లో భాగంగా రకరకాల హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే వాటి అమలుపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాలయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇలా రకరకాల హామీలను అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మిగతా హామీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. మొన్నటివరకు లోక్ సభ ఎన్నికల కోడ్ ఉండటంతో.. హామీల అమలు కొంత ఆలస్యమైంది. ఇప్పుడు కోడ్ ముగియటంతో.. ఆయా పథకాల అమలుకు విధి విధానాలు, నిధులు సమకూర్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కాగా.. ఇందులో భాగంగా.. మరో మూడు రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేశారు.
మంగళవారం రోజున ఖమ్మం జిల్లా తిరుమాయపాలెం మండలంలౌ మంత్రి పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపటి (జూన్ 12వ తేదీ) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి.. మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రూ.650 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
అంతేకాదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ధరణి బాధితుల నుంచి దరఖాస్తులు కూడా త్వరలో స్వీకరిస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లపై మరో మూడు రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతామన్నారు. అంతేకాదు వాటిని అమలు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటాని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని మరోసారి భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa