తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. ప్రజా భవన్ వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయంగా తన సహచరుడు, ఒకప్పుడు తమ అధినేత అయిన చంద్రబాబు నాయుడికి.. రేవంత్ రెడ్డికి అరుదైన బహుమతి అందజేశారు. భేటీ ప్రారంభానికి ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరికొకరు.. బహుమతులు అందజేసుకున్నారు. చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకాన్ని బహుకరించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు.. రేవంత్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. అయితే భేటీలో రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు నా గొడవ పుస్తకాన్ని అందివ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అసలేంటీ నా గొడవ ?
ప్రజాకవి కాళోజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ ఉద్యమం పుట్టకముందే.. తెలంగాణ ప్రజల కష్టనష్టాలపై పోరాడిన్ వ్యక్తి కాళోజీ. నా గొడవ పేరుతో ఆయన వెలువరించిన కవితా సంకలనం.. తెలంగాణ ప్రజల్లో చెరగని ముద్ర వేసింది. తెలంగాణ ఉద్యమానికి ప్రతిధ్వనిగా మారింది. నా గొడవ కవితా సంకలనంలో సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు కాళోజీ. అన్నాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ అపూర్వ, అపురూప కవితా సంకలనం.. తెలంగాణ రాజకీయ, సామాజిక చైతన్యాల సమాహారమని పలువురు సాహితీవేత్తలు కొనియాడారు.
అలాంటి అపురూపమైన పుస్తకాన్ని రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి సహా మరికొందరు ఉద్యోగులు హాజరయ్యారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బి.సి.జనార్దన్రెడ్డి, సీఎస్ నీరభ్ కుమార్, ఏపీ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa