ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టులో ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ,,,మంత్రి పొంగులేటి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2024, 10:56 PM

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చే ప్రక్రియపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆగస్టులో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని.. ఆగస్టులో తప్పనిసరిగా అందజేస్తామని పేర్కొన్నారు. ఆదివారం రోజున హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మువ్వా విజయబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. విజయబాబు రైతు నుంచి వచ్చిన నాయకుడని.. ఆయన తన పదవికి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులకు నీరందించడంలో.. నీటి పారుదల అభివృద్ధి సంస్థకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. ఖమ్మం జిల్లా మంత్రులం కూడా అండగా ఉంటామని తెలిపారు.


  రైతులకు సంబంధించిన టీజీఐడీసీ సంస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయటమే కాకుండా.. అభివృద్ధిని కూడా అందజేస్తున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. రైతులకు రూ. 31వేల కోట్ల రుణ మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాగితాలకే అంకితం చేశారన్నారు. గత ప్రభుత్వం నీటి పారుదల, ధరణి ద్వారా రైతుల పట్ల తప్పుడు నిర్ణయాలను తీసుకోగా తాము సరి చేస్తూ చట్ట సవరణలు తెస్తున్నామన్నారు.


మరోవైపు.. రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని మంత్రి సమీక్షించారు. జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నమై.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలతో పాటు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయటంతో.. అక్కడి పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెస్కూ టీంలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని.. పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa