ట్రెండింగ్
Epaper    English    தமிழ்

108 అంబులెన్స్ లో ప్రసవం పండంటి మగ బిడ్డకు జననం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 05:18 PM

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రానికి చెందిన మహేశ్వరి అనే గర్భిణీ శుక్రవారం అర్ధరాత్రి 108 అంబులెన్స్ లో ప్రసవించిందని ఈఎంటి చంద్రశేఖర్ తెలిపారు. పురిటి నొప్పులతో మక్తల్ ఆసుపత్రికి రాగా కాళ్లు వాపులు ఉండడంతో డాక్టర్లు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా సింగారం గేట్ దగ్గర మగ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa