తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం మూడు విడతల్లో రైతు రుణమాఫీ అమలు చేశారు. జులై 18న తొలి విడతలో రూ. లక్ష వరకు రుణాలు, ఆ తర్వాత రెండో విడతలో జులై 31న రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆగస్టు 15న మూడో విడతలో రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే రూ. 2 లక్షల పైగా రుణాలు ఉన్న రైతుల పరిస్థితి ఏంటని దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కొందరు రైతులు రూ. 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నారు. వారికి రుణమాఫీ వర్తింపజేసే అంశంపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు క్లారిటీ ఇచ్చారు.
అలాంటి రైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. రూ.2లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు రూ.2 లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించారు. ఆ తర్వాత రూ.2 లక్షల రుణమాఫీ పథకాన్ని వర్తింపచేస్తాస్తామని అన్నారు. ఉదాహరణకు ఎవరైనా రైతు రూ.2.20 లక్షలు లోన్ తీసుకుంటే.. ముందుగా రెండు లక్షల కంటే ఎక్కువగా ఉన్న ఆ రూ.20 వేలను బ్యాంకులో చెల్లించాలని చెప్పారు. మిగిలిన రూ. 2 లక్షలకు మాఫీ వర్తింప చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే అర్హులైన రైతులకు రూ.2 లక్షల్లోపు రుణాలన్నింటిని మాఫీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అందుకు 31 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదన్నారు. అలాంటి వారు వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు. అర్హత ఉన్నా రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. ఆధార్లో తప్పులుంటే ఓటర్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారన్నారు. రేషన్ కార్డు లేకపోతే సర్వే నిర్వహిస్తారన్నారు. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే పోర్టల్లో సరిచేస్తారన్నారు. అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే దిద్దుబాటు చర్యలు చేపట్టనన్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa