తెలంగాణ బీజేపీ రాష్ట్రవ్య వహారాల ఇన్ చార్జ్ గా అభయ్ పాటిల్ నియమితుల య్యారు.ఈ మేరకు బీజేపీ హైకమాండ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటకలోని దక్షిణ బెల్గాం ఎమ్మెల్యే అయిన అభయ్ కు ఆ రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనను యువత ఎక్కువగా ఫాలో అవుతుంటా రు. ఈ మేరకు ఈ విషయాన్ని అభయ్ పాటిల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అభయ్ పాటిల్ తెలంగాణ ఇన్ చార్జిగా వ్యవహరించారు. కర్నాటకలోని దక్షిణ బెల్గాం నుంచి మడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. క్రమంలో సోషల్ మీడియా ద్వారా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఓట్ పర్సెంటేజ్ సాధించిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్కాగా ప్రణాళికలు వేయాలని చూస్తున్నది. ఈ క్రమంలో అభయ్ పాటిల్ ను ఇన్ చార్జిగా నియమించడం ద్వారా ఎలాంటి ఫలితాలు రాబట్టబోతున్నదనేది చూడాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa