ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంథని ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఫిర్యాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 04:08 PM

మంథని ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని వినతి. మంథని సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున నాయి  బ్రాహ్మణ సోదరి హాస్పిటల్ లో పని చేసే కాంట్రాక్టు కార్మికురాలు విష్ణు భక్తుల పూర్ణిమ పట్ల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం. మూడు నెలలు క్రితం భర్త విష్ణు భక్తుల శ్రీనివాస్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ మరణించడం జరిగింది. మరణాంతరం ఇద్దరు ఆడపిల్లలతో బ్రతుకు బండి నడపడానికి  విష్ణు భక్తుల పూర్ణిమ పేషంట్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తుంది.
గత వారం రోజుల క్రితం మంచిర్యాల నుండి హాస్పటల్ సూపరింటెండెంట్ గా వచ్చిన డాక్టర్ రాజశేఖర్ స్వాతంత్ర  దినోత్సవం రోజున పూర్ణిమచే  కాళ్లకు ఉన్న బూట్లను తుడవమని, బూట్లలో ఉన్న ఇసుకను తీయమని బ్రిటిష్ దొరల వలే హుకుం జారీ చేసి తుడిపించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం రోజునే ఒక మహిళా సోదరి పట్ల అవమానకరంగా వ్యవహరించిన సదరు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మంథని మండల నాయి బ్రాహ్మణ సంఘం పక్షాన, కుల సంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్,ప్రజా సంఘాల నాయకులు బూడిద గణేష్, మంథని మండల నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బొమ్మగంటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa