తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జీరో టికెట్ తీసుకొని సిటీ ఆర్డీనరీ, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కిడి నుంచి ఎక్కిడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చు. అయితే పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ సిటీలో అయితే కాలు పెట్టేందుకు జాగా ఉండట్లేదు. దీంతో చాలా మంది మెట్రో డీలక్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సుల్లో టికెట్ తీసుకున్నా.. రద్దీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకురావాలని ఫ్లాన్ చేస్తోంది.
అందులో భాగంగా.. నగరానికి కొత్తగా 83 మెట్రో డీలక్స్ బస్సులు తీసుకురానున్నారు. ఇప్పటికే రద్దీకి అనుగుణంగా 42 బస్సులను ఆర్టీసీ వేర్వేరు మార్గాల్లో ప్రయాణికులకు సేవలందిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం 65 శాతం ఆక్యుపెన్సీ ఉందని అధికారులు తెలిపారు. కొత్త బస్సులను ప్రస్తుతం రద్దీగా ఉన్న మార్గాల్లో నడిపించి ఆదాయం పెంచుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇతర బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో చాలా మంది మెట్రో డీలక్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఆర్డినరీ ఇతర బస్సుల ధరలతో పోల్చితే 5 నుంచి 10 శాతం టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా ప్రయాణికులు ఇందులో ప్రయాణించేందుకే మెుగ్గు చూపుతున్నారు.
ఈ మేరకు కొత్త మెట్రో డీలక్స్ బస్సులను ఆర్టీసీ నడుపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 11 డిపోల్లో తొలి దశలో 24 బస్సులను ప్రారంభించింది. జగద్గిరిగుట్ట, మెహిదీపట్నం, ఎల్బీనగర్, హయత్నగర్, ఉప్పల్-మెహిదీపట్నం, సికింద్రాబాద్-ఈసీఐఎల్, అబ్దుల్లాపూర్మెట్, కోఠి మార్గాల్లో వీటిని నడుపుతున్నారు. మరో 18 బస్సులను రద్దీ మార్గాల్లో ప్రవేశపెట్టారు. కొత్తగా మరికొన్ని రూట్లలో బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు. మెట్రో డీలక్స్ మంత్లీ బస్పాసులు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.1450 డీలక్స్ బస్ పాస్తో మెట్రో ఎక్స్ప్రెస్, ఈ-మెట్రో ఎక్స్ప్రెస్ (నాన్-ఏసీ), సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ ప్రయాణించొచ్చు. బస్సుల సంఖ్య పెరిగితే మెట్రో డీలక్స్ పాస్ విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa