అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో రూ. 2.70 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, ఎనిమిది మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చాణక్య గురువారం తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa