ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 02:29 PM

నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది. కృష్ణానది తాగునీటి సరఫరా ఫేజ్ -1లోని పైపులైన్ లో దేవత్‌పల్లి వద్ద 300 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌లో ఆకస్మికంగా భారీ లీకేజీ జరిగిందని.. దీంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. లీకేజీ మరమ్మతులను యుద్ధప్రాతిపదిక చేపట్టి నేటి మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎయిర్ వాల్వ్ లీకేజీ వల్ల మిరాలం, కిషన్ బాగ్, సంతోష్‌నగర్‌, వినయ్‌నగర్‌, సైదాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పురా, ఆలియాబాద్, బొగ్గులకుంట, అప్జల్‌గంజ్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివంరోడ్‌, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌, మన్నెగూడ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలుగనున్నట్లు జలమండలి పేర్కొంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa