తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. పలు ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. హసన్పర్తి రోడ్ నుంచి కాజీపేట ఎఫ్ క్యాబిన్ వరకు నాలుగో లైను పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26 నుంచి అక్టోబరు 8 వరకు పలు ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రామగిరి ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 17003/04), సింగరేణి ( ట్రైన్ నెంబర్ 17034/34), కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ( ట్రైన్ నెంబర్ 12757/58)
సిర్పూర్ కాగజ్నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ( ట్రైన్ నెంబర్ 17011/12), భాగ్యనగర్ ( ట్రైన్ నెంబర్ 17233/34 ), గోల్కొండ ఎక్స్ప్రెస్ ( 17201/02 ట్రైన్ నెంబర్), గుంటూరు ఇంటర్ సిటీ ( ట్రైన్ నెంబర్ 12706/05), శాతవాహన సూపర్ ఫాస్ట్ ( ట్రైన్ నెంబర్ 12714/13), కాకతీయ ఎక్స్ప్రెస్ (17660/59), కాజీపేట జంక్షన్ - డోర్నకల్ జంక్షన్ పుష్పుల్ (07753/54 ), కరీంనగర్-సిర్పూర్టౌన్ పుష్పుల్ (07765), విజయవాడ - గుంటూరు ట్రైన్లు (07464/65) రద్దు కానున్నాయి.
వేగంగా రైల్వే లైన్ పనులు
హసన్పర్తి రోడ్ నుంచి కాజీపేట ఎఫ్ క్యాబిన్ వరకు ఈ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. పది కిలోమీటర్ల రైల్వే నిర్మిస్తున్న నాలుగో లైన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపుగా 400 మంది కార్మికులు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 50 మంది ఇంజినీర్లు షిప్టుల వారీగా నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు. పట్టాల నిర్మాణం మినహా మిగతా పనులను విభజించి కాంట్రాక్టర్లతో పూర్తి చేయిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసి మరీ పనులు సాగిస్తున్నారు. స్లీపర్ల అమరిక, క్రాసింగ్ల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక క్రేన్లను వాడుతున్నారు. ఈ పది కిలోమీటర్ల పరిధిలో 12 క్రాసింగ్లను నిర్మించనున్నారు.
ఇక అండర్ పాస్ నుంచి నేరుగా కాజీపేటకు వచ్చే ట్రైన్ల కోసం వేసిన లైన్కు కొత్తగా విద్యుత్తు లైన్ పనులు చేపట్టారు. ఇప్పటికే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటికి ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ తీగలు అమర్చుతున్నారు. ఈ మార్గంలో ట్రైన్ల వేగాన్ని తగ్గించి.. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa