నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు అందుకు అందరి ఆశీర్వాదం కావాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ వీరభద్ర స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అభ్యర్థులు కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారని నిరుద్యోగ సమస్యలపై ఏనాడు స్పందించిన పాపాన పోలేదని ఆయన అన్నారు విద్యాసంస్థల స్థాపనలో నాకు అపార అనుభవం ఉందని నిరుద్యోగులు డిగ్రీలు పట్టా చేత పట్టుకొని చాలామంది.
ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నేను గమనిస్తున్నానని వారి సమస్యలపై ప్రభుత్వం తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ సందర్భంగా స్వామివారికి కోరమీసాలు, గుమ్మడికాయలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు..ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయ ఈవో కిషన్ రావు స్వామివారి చిత్రపటాన్నీ అందజేసి ఘనంగాసన్మానించారు.తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని..కొత్త కొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజు నాయక్ యూత్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సత్యగోపల్ శ్రీరామ్ . తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa