ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 10:39 AM

ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమించటం ప్రారంభమైందని..వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోు తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..తెలంగాణలో సోమవారం కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు.. మరి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


 ఈ మేరకు వాతావరణ కేంద్రం 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa