కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, బాలికల కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. దేశంలో ఎక్కడో ఓ చోట ప్రతినిత్యం వారిపై లైంగిక దాడులు జరగుతూనే ఉన్నాయి. తాజాగా... హైదరాబాద్ యూసఫ్గూడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రే ఓ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి మారు తండ్రిపై పోక్సో కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్నగర్కు చెందిన ఓ మహిళ 2010లో తన భర్తతో విడిపోయింది. ఇద్దరు కూతుళ్లు ఉండటంతో మహిళ తన కూతుళ్లను స్వగ్రామంలోని సోదరుడి వద్ద వదిలేసింది. అనంతరం రహ్మత్నగర్కు చెందిన లింగంపల్లి మహేందర్తో మహిళకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో వారు పెళ్లి చేసుకున్నారు. అనంతరం వీరికి ఒక కుమారుడు పుట్టాడు. స్వగ్రామంలో సోదరుడి వద్ద ఉన్న కూతుళ్లను ఇంటికి తీసుకురావాలని మహేందర్ అడిగాడు. అందరం కలిసే ఉందామని చెప్పాడు.
దీంతో సదరు మహిళ 2019లో పెద్ద కుమార్తెను నగరానికి తీసుకువచ్చింది. అయితే ఏ పని చేయకుండా జులాయిగా తిరిగే మహేందర్ ఇంట్లోనే ఉండేవాడు. కుటుంబ పోషణ కోసం మహిళ మాత్రం పనికి వెళ్లేది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 9 ఏళ్ల పెద్ద కుమార్తె మహేందర్ కన్నేశాడు. తల్లి లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడటం మొదలు పెట్టాడు. గత నాలుగేళ్లుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ విషయం తల్లికి తెయటంతో యట చెబితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. ఇలా 2019 నుంచి 2023 ఫిబ్రవరి వరకు మైనర్ కుమార్తెపై మహేందర్ అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు.
తన కూతుర్ని కాపాడుకునేందుకు తల్లి తన కుమార్తెను 2023లో ఓ ప్రభుత్వ హాస్టల్లో చేర్పించింది. ఈ నెల 8న భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మహేందర్ మహిళకు సంబంధించిన బంగారు ఆభరణాలు, సెల్పోన్, డబ్బులు, టీవీ, ల్యాప్టాప్తో పాటు ఇతర వస్తువులను ఇంట్లో నుంచి తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో స్థానికుల సహాయంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మహేందర్పై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కూతురు లాంటి అమ్మాయిపై ఇంతటి నీచానికి దిగజారుతాడా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అసలు వీడు మనిషేనా అని మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa