హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే.. నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్ను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 22వ తేది నుంచి 28వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. నిర్ణీత సమయంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్ను మూసి వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆ మార్గం గుండా ప్రయాణాలు సాగించే వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎస్ఆర్డీపీ పనులలో భాగంగా గత కొంత కాలంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ కారణంగా అక్టోబర్ 28వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అయితే.. మిగతా సమయంలో వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. అయితే.. రాత్రి 11 గంటల తర్వాత ప్రయాణాలు సాగించే వారు ఈ వారం రోజుల పాటు... ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
అయితే.. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్ బైపాస్ చేస్తూ బిచ్చారెడ్డి స్వీట్స్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ఐఐఐటీ జంక్షన్కు చేరుకునేలా ట్రాఫిక్ను మళ్లీస్తున్నారు. మరోవైపు.. ఐఐఐటీ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్కు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ పక్క నుంచి బయోడైవర్సిటీ జంక్షన్కు చేరుకునే అవకాశం కల్పించారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులను గమనించి వాహనదారులు తమ గమ్యస్థానాలకు సులభంగా, సురక్షితంగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa