ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 06, 2024, 05:42 PM

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుల గణన సర్వే లో రెడ్డి కులస్తులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం వట్ పల్లిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి  ఆర్థికంగా సామాజికంగా విద్య,  ఉపాధి రంగాల్లో  సరైన న్యాయం జరగాలంటే ప్రతి ఒక్కరు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
ఈ విషయంపై ప్రతి ఒక్కరికి  అవగాహన చేయాలనీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినదన్నారు. రాష్ట్రంలో ఉన్నా అన్ని సంఘాలు ఏకతాటికి వచ్చి మన కులం ఐక్యత చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక రెడ్డి నాయకులు చంద్ర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రుక్మారెడ్డి, అభిలాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa