ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది : కేటీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 11:10 AM

సీఎం రేవంత్‌ రెడ్డి అసమర్ధ పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  ఫైర్‌ అయ్యారు. పసలేని, పనికిరాని పాగల్‌ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని విమర్శించారు.కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో తెలంగాణ గరమైతున్నదని మండిపడ్డారు. అసమర్థ మూర్ఖ ఏలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా అసంతృప్తులు కొనసాగుతున్నాయని ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.'తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో నా తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి.


ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు. 'హైడ్రా' దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌ల నిరసన. ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర. కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి. గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు.' అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa