ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర ప్రజలకు ఈటల విజ్ఞప్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 02:57 PM

హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎలా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారో మళ్లీ అదే తరహాలో మహారాష్ట్ర ప్రజానీకాన్ని కూడా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలను మేధావులు, ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ప్రజలకు ఈటల విజ్ఞప్తి చేశారు. ఎన్ని అడ్డదారులు తొక్కైనా అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తున్నదని ధ్వజమెత్తారు. దేశ ప్రజలచేత తిరస్కరించబడిన పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో దివాలా తీసిందని కర్ణాటకలో చేతులెత్తేసిందన్నారు. తెలంగాణలో ఉచిత బస్సు తప్ప ఏ హామీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. అలవి కానీ హామీలు ఇచ్చి అభాసుపాలు కావొద్దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేనే స్వయంగా చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందామని మహారాష్ట్ర ప్రజలను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa