లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడి ఘటనపై పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి స్పందించారుఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు అంటూ పేర్కొన్నారు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారని తెలిపారు. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్గా పోలీసులు గుర్తించారని వెల్లడించారు.దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ మాట్లాడారని ఆరోపించారు. సురేష్ తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి అంటూ ఆరోపించారు. సురేష్ పై రేప్ కేసుతో సహా పలు కేసులు ఉన్నాయని, సురేష్ పై కేసులు తొలగించేలా పట్నం నరేందర్ రెడ్డి సహాయం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై జరిగిన దాడి ఘటనలో పలువురు గ్రామస్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa