సంగారెడ్డి జిల్లా జోగిపేట సర్కిల్ పరిధిలోని వట్పల్లి మండలం పల్వట్ల గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీ లో ఉన్నట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం జోగిపేట సీఐ కార్యాలయంలో నిందితుడిని ప్రవేశపెట్టిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పల్వట్ల గ్రామానికి చెందిన సునందారెడ్డి కొడుకు వెంకట్ రెడ్డి వ్యాపార నిమిత్తం బీదర్ లో స్థిరపడగా సునందారెడ్డి మాత్రం గ్రామంలోనే వ్యవసాయ భూములు చూసుకుంటూ అక్కడే ఉంటున్నారు. గ్రామానికి వెంకట్రెడ్డి వచ్చే సమయంలో డ్రైవర్ మహిపాల్రెడ్డి వెంట వచ్చేవాడు. గ్రామంలో వెంకటరెడ్డి తల్లి ఒక్కరే ఉండడాన్ని గమనించిన డ్రైవర్ మహిపాల్రెడ్డి దొంగతనం చేయాలని పథకం రూపొందించారు.
గతంలో జరిగిన దొంగతనం కేసులో మహిపాల్రెడ్డి నిందితుడు కాగా, జైలులో పరిచయమైన మోసిన్, సోహెల్తో కలిసి పల్వట్లకు అక్టోబర్ 21వ తేది అర్దరాత్రి చేరుకున్నారు. రాత్రిపూట వెంకటరెడ్డి తల్లి సునందారెడ్డిని నిద్రలేపి ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న విషయాన్ని ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టిపడేశారు. ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు, బంగారు మాటీలు, చెవి రింగులు, రూ.20 వేల నగదును దోచుకున్నారు. సంఘటనపై భాదితులు కుటుంబ సభ్యులు వట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి డ్రైవర్ మహిపాల్రెడ్డిని సోమవారం బీదర్ ప్రాంతంలో అరెస్టు చేసి చేశారు. నిందితుడిని రిమాండ్కు పంపుతున్నట్లు సీఐ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. నిందితుడి వద్ద నుంచి పుస్తెలతాడు, దొంగతనానికి ఉపయోగించిన బైకు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ఐ విఠల్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa