ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 22న లోక్‌మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు : కిషన్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2024, 12:01 PM

హైదరాబాద్ లో ఈ ఏడాది లోక్ మంథన్ (Lok Manthan 2024) జరగడం సంతోషంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి . శిల్పకళావేదిక (Silpakala Vedika)లో ఈ నెల 21 నుంచి 24 వరకు లోక్‌మంథన్‌ జరుగుతుందని ఆయన తెలిపారు.శుక్రవారం హైదరాబాద్ లో ఉన్న బేగంపేట (Begumpet) పర్యాటక భవన్లో లోక్ మంథన్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా లోక్‌మంథన్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ లోక్‌మంథన్‌ కార్యక్రమంలో కవులు, కళాకారులు, విదేశీ అతిథులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నెల 21న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభం వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని, ఈ నెల 22న లోక్‌మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa