ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి కిడ్నీ ఇచ్చినా దక్కని కుమారుడి ప్రాణం.. గుండెలు పిండేసే ఘటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 07:46 PM

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. త‌న ప్రాణాన్ని ఫ‌ణంగా పెట్టిన ఓ తల్లి కుమారుడిని బతికించుకోవాలనుకున్నా ఫలితం లేకుండా పోయింది. కుమారుడికి కిడ్నీ దానం చేసినా ప్రాణం నిలవలేదు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతుల కుమారుడు రాము.


అతడికి భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, అయిదేళ్ల కూతురు ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటా సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని కిడ్నీ సంబంధిత వ్యాధి కుదిపేసింది. రాము అనారోగ్యం బారిన పడటంతో ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు కిడ్నీ ఫెయిల్ అయినట్లు గుర్తించారు. డయాలసిస్‌తో కొంత ఉపశమనం పొందినా.. కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. కుమారుడి అనారోగ్యాన్ని తట్టుకోలేక తల్లడిల్లిన ఆ తల్లి.. కొడుకు కంటే తనకేదీ ఎక్కువ కాదనుకొనుకుంది. అతడి జీవితాన్ని నిలబెట్టేందుకు తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది.


తల్లి సత్తెమ్మ తన కుమారుడికి కిడ్నీనిదానం చేసింది. తల్లి కిడ్నీని అమర్చిన తర్వాత రాము ఏడాదిపాటు బాగానే ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రాము మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఆలస్యం చేయకుండా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాము.. ఆరోగ్యం విషమించి శుక్రవారం (నవంబర్ 15) మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితమే రాము తండ్రి లక్ష్మయ్య కూడా మృతి చెందాడు. ఇప్పుడు ఏకైక కుమారుడు మృతి చెందటంతో సత్తెమ్మ గండెలవిసేలా రోధించారు. అది చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకుడు మృతి ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గాజులరామారానికి చెందిన కేసాని వెంకన్నస్వామి(30), వైజాగ్‌కు చెందిన పిల్లి దేవకుమారస్వామి(25) సాప్ట్‌వేర్ ఉద్యోగులు. గచ్చిబౌలిలో సినిమా చూసి గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో హాస్టల్‌కు బయల్దేరారు. ట్రిపుల్‌ఐటీ జంక్షన్‌ నుంచి విప్రో జంక్షన్‌కు వెళ్లే మార్గంలో ఒక్కసారిగా బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa