వరంగల్ జిల్లా ఖానాపురం మండల అధ్యక్షుడు ఆబోతు రాజు యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఖానాపురం మండలం గొల్లగూడెం తండా నుండి లవన్ నాయక్ ఆధ్వర్యంలో పూల్ సింగ్, బన్నీ, అజిత్, లోకేష్, గణేష్, కుమార్, సురేష్, సతీష్, మోహన్, వంశీ మరియు సుభాష్, అలాగే విరితో పాటు ఇంకా 25 మంది జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని బిజెపి పార్టీలోకి చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్ రెడ్డి యువతకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి, రాష్ట్రం జిల్లా మరియు నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు చూసి ఆకర్షితులై యువత భారతీయ జనతా పార్టీ వైపు రావడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు భారతీయ జనతా పార్టీలో ప్రాధాన్యత కల్పించి వార్డ్ మెంబర్లుగా, సర్పంచులుగా, జడ్పిటిసిలుగా, ఎంపీటీసీలుగా, పోటీ చేసే అవకాశం కల్పించి మెజార్టీ స్థానాలను గెలిచి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థమైన పాలనపై, ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రభుత్వ పనితీరుపై, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుపై ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నింస్తామని తెలియచేశారు.
ఈ చేరికల కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు, పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి, నర్సంపేట రూరల్ మండల అధ్యక్షులు గంగిడి మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పొదిల్ల రామచందర్, తవుటు రమేష్, ఖానాపురం మండల నాయకులు రాధారపు అశోక్, సహదేవ్, మల్లారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు సందీప్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొంకిస విగ్నేష్ గౌడ్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు, యువ మోర్చా మండల చెన్నారావుపేట మండల అధ్యక్షులు కొనకటి నవీన్ రెడ్డి, మరియు పార్టీ నాయకులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa