ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందుబాబులకు కిక్కెక్కించే వార్త.. రేవంత్ సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 07:48 PM

మందుబాబులు ఎగిరిగంతేసే వార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు పెంచుతారంటూ మందుబాబులను టెన్షన్ పెడుతూ.. పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న వేళ.. ఎక్సైజ్ శాఖ కిక్కెక్కించే వార్త వినిపించింది. ధరల విషయంతో పాటు వచ్చే సీజన్‌కు లిక్కర్ ప్రొడక్షన్ విషయంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ప్రస్తుత సీజన్‌కు సరిపడా మద్యం నిల్వలను సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం.. వచ్చే వేసవి కోసం కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అసలే వచ్చేది వేసవి కావటంతో.. మందుబాబులు చల్లచల్లని బీర్ల కోసం వైన్ షాపులకు పరుగులు పెడుతుంటారు. కాగా.. గడిచిన వేసవిలో సరిపడా బీర్లు లేక.. వైన్ షాపులలో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వటంతో.. మద్యంప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రవ్యా్ప్తంగా బీర్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ క్రమంలోనే.. కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు సంబంధించిన బీర్లు అందుబాటులో ఉంచాలంటూ కొంత మంది ప్రభుత్వానికి లేఖలు రాయటం.. తమదైన శైలిలో డిమాండ్లు చేయటం లాంటివి చేశారు.


అయితే.. గత వేసవి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ.. వచ్చే ఎండాకాలంలో బీర్ల కొరతలేకుండా ఇప్పటి నుంచే అలర్ట్ అయ్యింది. వచ్చే వేసవిలో ఎలాంటి బీర్ల కొరత లేకుండా సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని బేవరేజెస్ కంపెనీలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడే ఆదేశించింది. దీంతో.. బేవరేజెస్ కంపెనీలు నెల రోజులుగా బీర్ల ఉత్పత్తి భారీగా పెంచింది. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ కంపెనీలో.. సాధారణంగా అయితే.. నెలకు 3 నుంచి 4 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి అవుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 5 లక్షలకు పెంచటం గమనార్హం. కేవలం సంగారెడ్డిలో ఉన్న ఒక్క కంపెనీ మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు.. బీర్ల ఉత్పత్తిని పెంచినట్టు సమాచారం.


ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఉత్పత్తిని పెంచిన బేవరేజెస్ కంపెనీలు.. వచ్చే సమ్మర్ సీజన్‌లో మందుబాబులకు కిక్కెక్కించేందుకు ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాయి. ఫలితంగా.. వచ్చే వేసవికి సరిపడా స్టాక్ అందుబాటులో ఉండనుంది. గత వేసవిలో లాగా వైన్ షాపుల్లో చిల్డ్ బీర్లు లేకుండా నో స్టాక్ బోర్డులు కనిపించే అవకాశం ఉండదని బేవరేజెస్ కంపెనీలు భావిస్తున్నాయి.


మరోవైపు.. గత కొన్ని రోజులుగా తెలంగాణలో మద్యం ధరలను భారీగా పెంచనున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలు పెంచే ఆలోచనపై కాకుండా.. అమ్మకాలపైన దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. మద్యం విక్రయాలతో ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతున్న వేళ.. ఎక్కడా అధిక ధరలకు లిక్కర్ విక్రయించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే.. పెంచాల్సిన సమయంలో భారీగా కాకుండా నామమాత్రపు పెంపు మాత్రమే చేసి.. సేల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా.. లాభాలు రాబట్టొచ్చన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అయితే.. రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులపై ఫోకస్ పెట్టిన సర్కారు వాటి బెండు తీసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa