TRS అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్ అని KTR కొనియాడారు. 'కరీంనగర్ లో జరిగిన సింహా గర్జన ద్వారానే కేసీఆర్ దేశానికి పరిచయమ్యారు. MP ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీ ఇచ్చి TRSను గెలిపించారు. 2009 ఎన్నికల్లో BRS ఓడిపోయిందన్నప్పుడు చాలా మంది అవమానకరంగా మాట్లాడారు. కానీ కేసీఆర్ కరీంనగర్ వేదికగా నా శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో అంటూ గర్జించారు. కరీంనగర్ ప్రజల పోరాట స్ఫూర్తి లేకుంటే తెలంగాణ సిద్ధించేదో లేదో తెలియదు' అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa