ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులి దాడిలో యువతి మృతి.. 15 గ్రామాల్లో హై అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 10:46 AM

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  కాగజ్‌నగర్  మండల పరిధిలో ఇంకా పులి భయం వీడలేదు. శుక్రవారం బెంగాలీ క్యాంపు ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి  అనే యువతి పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లగా ఆమెపై పులి దాడి చేసి చంపేసింది.ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు  మొత్తం 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈద్గాం, నజ్రాల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, ప్రాంతాల్లో పులి సంచరిస్తన్నట్లుగా వారు తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వారు పొలం పనులకు వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa