ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ పై ప్రత్యేక దృష్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 03:00 PM

సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ రుద్రేశ్వరాలయాన్ని సందర్శించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీరుద్రేశ్వరుని దర్శనం చేసుకోగా వేద పండితులు శ్రీ రుద్రేశ్వర ఆలయ ప్రశస్తిని మంత్రికి వినిపించి, ఆలయ అభివృద్ధికి సహకరించాలని విన్నవించి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం గ్రామంలో గల మాజీ దేశ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ విగ్రహానికి మరియు మాజీ మంత్రి దివంగత మదన్మోహన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ ఫైజనింగ్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురుకులాల్లో, ప్రభుత్వ హాస్టల్లో ఎక్కడో ఇక్కడో ఏదైన ఫుడ్ ఫైజనింగ్ జరిగితే దాన్ని పెద్ద అంశంగా మార్చి రాద్ధాoతం చేస్తున్న రాజకీయపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. విద్యార్థులకు సంభందించిన ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దు.
రేపటి నుండి గురుకులాల సందర్శన చేస్తున్నారని తెలుస్తుంది. బలహీనవర్గాల మంత్రిగా వాటన్నిటిని సవరించే ప్రయత్నం చేస్తున్నాను అని అన్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నట్లు అనిపిస్తే ప్రతిపక్ష పార్టీలు మంత్రికి కానీ నాకు, అధికారులకు, విజ్ఞప్తి చేయాలి తెలిపారు. కానీ హాస్టల్ల ముందుకు పోయి రాద్ధాంతం చేస్తే ఊరుకోము. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు అన్ని స్థాయిలలో ఈ అంశంపై స్పందిస్తున్నాం అని అన్నారు. మెస్ చార్జీలు మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచినం అని అన్నారు. టీచర్ల నియామకం, అద్దె భవనాల చార్జీలు చెల్లించినం అన్ని హాస్టల్లో, గురుకుల విద్యాలయాలలో ఈజీఎస్ ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దెందుకు, ప్లాంటేషన్ కోసం ఆదేశాలు జారి జారీచేసినం అని తెలిపారు. ఆయన కూడా ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలలో అపరిశుభ్రత, భోజన సదుపాయలలో ఏదైనా అశ్రేద్దతో సంఘటనలు జరిగితే సమీక్షించి సంబంధిత అధికారులు, వార్డెన్ ల పై చర్యలు తీసుకుంటాము అన్నారు. ఫుడ్ ఫైజనింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అవసరమైన చోట వంట సంబంధిత వారిని మార్చుకోండి, మెనూ చేంజ్ చేసుకోండి, కాస్మోటిక్ చార్జీలతో పాటు  మిస్ చార్జీలను పెంచినం. పెండింగ్ బకాయిలను వెంటనే ఇచ్చే విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా వ్యవస్థ నడుస్తుందని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎస్పీలు, ప్రజాప్రతినిధులు హాస్టళ్ళు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలలో పర్యటించి ఎక్కడైనా సమస్య గుర్తించి నా దృటికి తీసుకు వస్తే నేను వచ్చి పరిష్కరించేందుకు భాద్యత తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa