రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలలో నిత్యం విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మరియు విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మోర్చాల ఆధ్వర్యంలో దామోదరం సంక్షేమ భవన్ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ చేపట్టే శాంతియుత నిరసన కార్యక్రమానికి హాజరు కాకుండా నర్సంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధకాండకు నిదర్శనం.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పాలన గత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శమని ప్రజా సమస్యలపై విద్యార్థిని విద్యార్థుల సమస్యల విషయంపై శాంతియుత నిరసన చేపడితే ప్రభుత్వం ఇంత భయానికి గురి అయ్యి అక్రమంగా అరుసులు చేయడం అనైతికం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇలాంటి అరెస్టులకు భయపడరని తక్షణమే విద్యార్థులు విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాము. అరెస్ట్ అయిన వారిలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బానోతు వీరు నాయక్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తనువులు అంబేద్కర్, నర్సంపేట పట్టణ ఎస్ సి మోర్చా అధ్యక్షులు కేశపకం బాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa