అసలే ఆదివారం..ఆపై రైస్ మిల్లుల్లో పని చేసే బీహార్ హమాలీ కార్మికులు..ఇద్దరి మధ్య మాట మాట పెరిగి చిన్నగా మొదలైన గొడవ కాస్తా పెద్దదై రక్త చరిత్రకు దారి తీసింది.తన్నుకున్న గొడవలో ఏడుగురు కూలీలకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి.రక్తచరిత్రను వీడియోలో బంధించిన ఓ వ్యక్తి కరీంనగర్ సీపీకి పంపినట్లు ప్రచారం జరుగుతోంది.పంచాయతీ ఠాణాకు చేరడంతో సుమారు వంద మంది బీహార్ హమాలీ కార్మికులు మానకొండూర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి గ్రామ సమీపంలో ఉన్న అంజలి,జ్ఞానేశ్వర్,అన్నపూర్ణ రైస్ మిల్లుల్లో పని చేసే బీహార్ కూలీలకు మానస,కామదేనువు,లావణ్య రైస్ మిల్లుల్లో పని చేసే కూలీలకు మధ్య గొడవ జరిగింది.రైస్ మిల్లుల సమీపంలో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై కర్రలతో దాడి చేసుకుంటున్నారు.
దాడిలో ఎడుగురు హమాలీల తలలు పగిలాయి.గొడవ జరుగుతున్న ప్రాంతం రణరంగంగా మారింది.దాడి చేసుకుంటున్న సమయంలో అటుగా కారులో వెళుతున్న వీణవంక మండలానికి చెందిన ఓ వ్యక్తి గొడవను చూసి కారు నిలిపి గొడవను ఆపే ప్రయత్నం చేసాడు.గొడవను ఆపే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి కారుపై రాయితో దాడి చేశారు.ఆ వ్యక్తి గొడవను ఆపకున్నట్లయితే ఇరువురి ప్రాణాలు గాలిలో కలిసేవని తెలిసింది.గొడవను ఆపేందుకు ఆగిన వ్యక్తి గొడవను అంతా తన ఫోన్ లో రికార్డు చేసి కరీంనగర్ సీపీకి పంపినట్లు హమాలీ కార్మికులు అనుకుంటున్నారు.ఇరు వర్గాలకు చెందిన సుమారు వంద మంది హమాలీ కార్మికులు మానకొండూర్ పోలీసు స్టేషన్ కు వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa