కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నెలకొల్పిన మహనీయుల విగ్రహాల ముసుగులు వెంటనే తొలగించాలని తిమ్మాపూర్ జేఏసి నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. రెండేళ్ల క్రితం నెలకొల్పిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్రహాలపైనున్న ముసుగులు తొలగించడం లో జరుగుతున్న కాలయాపనపై అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఇటీవల జేఏసి గా ఏర్పడి మొదటిసారిగా తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.
జేఏసీ కన్వీనర్లు మాతంగి శంకర్, దుండ్ర రాజయ్య, సుగుర్తి జగదీశ్వరాచారి, తీన్మార్ మల్లన్న సభ్యుడు అఖిల్ పాషా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రాం ల విగ్రహాలపై ముసుగులు తొలగించాలని ఏర్పాటు చేసిన జేఏసీ వెనక ఎవ్వరి ప్రొద్భలం లేదని ముఖ్యనాయకులు గమనించాలని తెలిపారు. ఒక వారం పాటు శాంతియుత నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తామన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా కలుస్తామన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. జేఏసీ కన్వీనర్ వంతడుపుల సంపత్, సభ్యులు పార్నంది జలపతి, కొయడ మురళీ, బోయిని తిరుపతి, సందుపట్ల మల్లేశం, కొమ్ము సంపత్, తుర్పాటి అజయ్, గజా సాగర్, ఇనుకొండ నరేష్ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa