తెలంగాణ రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారi. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ చూడటానికి వెళ్లి తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన తనను కలిచివేసిందన్నారు. రేవతి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన.. ఇకనుంచి తెలంగాణలో ఏ సినిమాకైనా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించారు. సంధ్య థియేటర్ ఘటనపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్కడికి రావడం కరెక్ట్ కాదన్నారు. సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. పోయిన ప్రాణం తిరిగి తీసుకొస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్ల బడ్జెట్.. వేల కోట్ల కలెక్షన్లు అని చెప్పుకుంటున్నారు కదా.. బాధిత కుటుంబానికి రూ.25లక్షలు ఇవ్వలేరా? అని నిలదీశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ‘పుష్ప 2’ నిర్మాతలు, హీరో అల్లు అర్జున్ని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa