ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ భవన్​లో​ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 03:01 PM

 కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయమని భారాస ఎమ్మెల్సీ కవిత  అన్నారు. తెలంగాణ ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మను తొలగించి..హస్తం పార్టీ గుర్తును పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కార్యకర్తలతో కలిసి కవిత పాలాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు.''ఉద్యమ కాలంలో పెద్దలు నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బతుకమ్మను విగ్రహంలో ఎందుకు చేర్చలేదు? తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తామన్నారు.. ఆ జాబితాలో మహిళలు ఎక్కడ? స్ఫూర్తి నింపే తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. కాంగ్రెస్‌ తల్లిని పెట్టుకున్నారు. ఉద్యమకాలం నాటి ప్రతీకలను అవమానించే యత్నం చేస్తున్నారు. సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్‌ తల్లిని తిరస్కరిస్తున్నాం'' అని కవిత అన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa