భార్యా, భర్తల నడుమ గొడవ జరగడంతో మనస్థాపానికి గురై ఉరేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సంతోష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ధర్మసాగర్ గ్రామానికి చెందిన కమ్మరి విజయ్ కుమార్(33) వృత్తి రీత్యా టైలర్. విజయ్ కుమార్ తన భార్య సుమలతకు గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
గొడవ జరిగిన ప్రతిసారి విజయ్ కుమార్ చనిపోతానని బెదిరించేవాడు. గతంలో కూడా సెల్ఫోన్ టవర్ ఎక్కి చనిపోతానని బెదిరించినాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మళ్లీ గొడవ జరగగా ఆ గొడవను మనసులో పెట్టుకొని విజయ్ కుమార్ చలికావేశంలో ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుని తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa