మంచువారి ఫ్యామిలీ ఫైట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గత వారం రోజులుగా మంచు వారి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు.. సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. డిసెంబర్ 10న రాత్రి మంచు మనోజ్తో జరిగిన ఘర్షణతో పాటు, మీడియా ప్రతినిధిపై దాడి చేయగా.. ఈ ఎపిసోడ్లో మోహన్ బాబు తలకు, కాలికి గాయాలు కావటంతోపాటు, కాస్త అస్వస్థతకు గురయ్యారు. దీంతో.. ఆయనను వెంటనే కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు మంచు విష్ణు. కాగా.. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మోహన్ బాబు.. నేడు (డిసెంబర్ 12న) మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. హైపర్ టెన్షన్, బీపీ లాంటి పలు కారణాలతో ఆస్పత్రిలో చేరిన మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిచగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదురుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మంచువారి ఫ్యామిలీ ఫైట్ వ్యవహారంపై రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరణ ఇచ్చారు. తెలుగురాష్ట్రాల్లో మొదటిసారి సినీ సెలబ్రిటీని బైండోవర్ చేసినట్టు సీపీ సుధీర్ కుమార్ చెప్పుకొచ్చారు. మోహన్బాబు ఇంటి సమస్య పూర్తిగా వారి వ్యక్తిగతమని తెలిపిన సీపీ.. మంచు ఫ్యామిలీలో మూడు కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. మోహన్బాబు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే.. మీడియాపై మోహన్ బాబు దాడి చేసిన ఘటనలో కూడా ఓ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన కేసులో మోహన్బాబు మేనేజర్ కిరణ్ను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు సీపీ సుధీర్బాబు వివరించారు.
కాగా.. డిసెంబర్ 10న రాత్రిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన తర్వతా.. మంచువారి ఫ్యామిలీ గొడవలను పోలీసులు సీరియస్గా తీసుకుని.. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 11న ఉదయం పదిన్నరకు సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులివ్వగా.. మొదట మంచు మనోజ్ విచారణకు వెళ్లారు. మంచు విష్ణు మాత్రం రాత్రి సమయంలో విచారణకు హాజరయ్యారు. అయితే.. మోహన్ బాబు మాత్రం విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే.. ఇకపై తనవల్ల ఎలాంటి గొడవలు జరగవని లక్ష రూపాయల సొంత పూచికత్తుపై మంచు మనోజ్ బాండ్ పేపర్ రాసిఇచ్చారు. మరోవైపు పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా.. ఈనెల 24వరకు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది ధర్మాసనం. పైగా.. మోహన్ బాబు ఇంటిపై నిఘా పెట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa