మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ లో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం(కెజిబివి)ని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.కెజిబివి హాస్టల్ లోని డైనింగ్ హాల్,కిచెన్ షెడ్ పరిశీలించారు. భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు వండే బియ్యం పరిశీలించారు.
ధర్నాలో పాల్గొంటున్న టీచింగ్,నాన్ టీచింగ్ స్టాప్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.పరిశుభ్రత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని వంటకు ఉపయోగించే నీరు నిలువ ఉంచే నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శుభ్రం చేసిన తేదీని ట్యాంక్ మీద ప్రదర్శించాలని సూచించినారు.టీచింగ్ స్టాఫ్ ధర్నాలో పాల్గొంటున్న నేపథ్యంలో విద్యార్థులకు తరగతుల నిర్వహణ విషయంలో ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా వేరే ఉన్నత పాఠశాలల నుండి మహిళా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు.డిఈఓ వెంట మండల విద్యాధికారి మధుసూదనాచారి,జిసిడిఓ కృపారాణి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa