సంక్రాంతికి తెలంగాణ నుండి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నడపనున్నట్లు APSRTC ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ సర్వీసులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉండనున్నాయి. అదనంగా మరో 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతామని, ఈ సర్వీసులకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని సంస్థ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa