ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2025, 04:05 PM

విద్యార్థులు, ఉపాధ్యాయులు న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చునని  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్‌ సూచించారు. ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ సంగారెడ్డి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి  జి. భవానిచంద్ర ఆదేశాల మేరకు మంగళవారం సంగారెడ్డి లో నిర్వహిస్తున్న  జోగిపేట శాఖ మహాత్మా జ్యోతి బా పూలే బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో  జాతీయ న్యాయ అవగాహనా సదస్సు నిర్వహించారు. విద్యార్థులు   అన్ని చట్టలపైనా అవగాహన కలిగి ఉండాలి అన్నారు.
అందరు క్రమశిక్షణగా ఉండాలి అన్నారు. న్యాయ వ్యవస్థలో ఎలా ఉండాలో వారికి వివరించారు. విద్యార్థుల  పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. వారి బాగోగులను కూడా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తేలిపారు. విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. విద్యార్థులకు అందించే భోజనం  నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నారు. హాస్టల్‌ వార్డెన్‌ ను విద్యార్థులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్‌ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa