ఖమ్మం జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుఢీకొంది.ఈ బస్సు గుప్తా ట్రావెల్స్కు చెందినదిగా సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి సూర్యాపేట డీఎస్పీ రవి, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ దుర్గటన జరిగింది. టైర్ పేలి పక్కకు ఆపుకున్న ఇసుక లారీని బస్సు ఢీ కొట్టినట్లుగా సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa