తెలంగాణ మరో ఎన్నికల సంబురానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో పాటు ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. అయితే.. ఈసారి అన్ని పార్టీల కంటే ముందే.. బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ మేరకు శుక్రవారం (జనవరి 10న) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు.
నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్యను ప్రకటించగా.. కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రుల అభ్యర్థిగా కిషన్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో అభ్యర్థులను ప్రకటించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వెల్లడించారు.
అయితే... కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థాయి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుండగా.. ఆయా స్థానాల్లో ఎన్నికల కోసం ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండనుందని అంచనాలు వేస్తున్నారు.
అయితే.. ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28 వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా.. పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఫైనల్ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందేనని.. గతంలో ఓటు ఉన్నా మరోసారి ఓటు నమోదు చేసుకోవాల్సిందేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa