ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్గొండ జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి సంచలన నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 17, 2025, 03:19 PM

నల్లగొండ కలెక్టర్ ఇల త్రిపాఠీ  సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 100 మంది పంచాయతీ కార్యదర్శుల  సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పంచాయతీ కార్యదర్శులు మండల పరిధిలోని ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గత రెండు నెలలుగా ఒక్కొక్కరు ఒక్కో కారణం చేత గత రెండు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు.అయితే, విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇల త్రిపాఠి వారి సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వారు తిరిగి విధుల్లోకి చేరేందుకు కలెక్టర్ వద్దకు రాగా.. గైర్హాజరైన రెండు నెలల కాలానికి సర్వీస్ బ్రేక్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులకు వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టర్ నిర్ణయంతో భవిష్యత్తులో రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్స్, పెన్షన్ల విషయంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పంచాయతీ కార్యదర్శులు లబోదిబోమంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com