ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రేటర్‌లో రాత్రివేళల్లో చలి తీవ్రత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2025, 11:29 AM

గ్రేటర్‌లో రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 32 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్రత పెరిగినా, రాత్రుళ్లు కనిష్ఠ ఉష్ణోగ్రతలతో 8-13 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరిగింది.మంగళవారం పటాన్‌చెరు(Patancheru)లో అత్యల్పంగా 8.6డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌(Rajendranagar)లో 10, దుండిగల్‌లో 13.8, బేగంపేట ప్రాంతాల్లో 13.8, హయత్‌నగర్‌లో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటంతో చలితీవ్రత అధికంగా ఉంది. తెల్లవారు జామున ప్రధాన రహదారులను పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa