చింతలమానేపల్లి మండలంలోని లంబడిహెట్టి, రణవెల్లి గ్రామాల్లోని నాటుసారాయి స్థావరాలపై గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ వీ రవి తెలిపిన వివరాల ప్రకారం.. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడులలో 60లీటర్ల నాటుసారా, 30 కిలోల బెల్లం, 10 కిలోల పటికని స్వాధీన పరచుకుని, ఆరుగురిపై కేసులు నమోదు చేశాన్నారు. 4000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిట్లు సీఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa