ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రత్యేక గుర్తింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 04:28 PM

ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రత్యేక గుర్తింపు ఉందని  అందోలు తహశీల్దార్‌ విష్ణుసాగర్‌ అన్నారు. బుధవారం  జోగిపేటలోని పలు ప్రధాన కూడలిల వద్ద కళాకారుల ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకొని, ఓటరుగా నమోదు చేసుకొవాలన్నారు. తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పరచుకోవడంలో ఓటర్లదే కీలకభాద్యతయని అన్నారు.
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఓటు హక్కు ఉన్న ప్రతి ఒటరు ఎన్నికల సమయంలో తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ  నెల 25వ తేదీన నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కొరారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ తహశీల్దార్‌ (ఎన్నికలు) చంద్రశేఖర్, కళాకారుల బృందం సభ్యులు కొమ్ములు శేఖర్‌ గౌడ్, నేనవాత్‌ మదన్‌ సింగ్,నేనవాత్‌ రవీందర్,నల్లవాగుల శశిప్రియ,ధరవాత్‌ రాజు,చామంతి ఆగమయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com