ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళా ఏర్పాట్లు చాలా బాగున్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 04:14 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో  మహా కుంభమేళాకు సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  తన ఫ్యామిలీతో కలిసి కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం కుంభమేళాపై కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. మహాకుంభమేళా పై చాలా మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలిపారు. ఒకవైపు కోట్లలో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తుంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.స్నానం చేస్తే భోజనం వస్తుందా? ఈ మహా కుంభమేళాకు భోజనానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, సోనియా.. చేతకాని కాంగ్రెస్‌ ప్రతి విషయం రాజకీయం చేస్తోంది.. కాంగ్రెస్ దగ్గర మాట్లాడడానికి వేరే సబ్జెక్ట్ లేక కుంభమేళాపై కామెంట్స్ చేస్తున్నారని ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేని ప్రెసిడెంట్ వచ్చిండని కూడా ప్రజలు నవ్వుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. హిందూ మనోభావాలు దెబ్బతీసే మాటలు మాట్లాడొద్దని, లేదంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ ఉండదని, కుంభమేళాపై ఖర్గే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa