సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయానికి విచ్చేసిన అఘోరి మాత.. తనను ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనానికి అనుమతించాలంటూ హల్చల్ చేసింది. అయితే.. వస్త్ర ధారణతో వస్తేనే దర్శనానికి అనుమతినిస్తామంటూ ఆలయ అధికారులు ఆమెకు సూచించారు. అక్కడే అఘోరీ మాతకు కోపం వచ్చింది. ఆమె గురించి తెలిసి కూడా మల్లన్న ఆలయ అధికారులు, సిబ్బంది.. బట్టలేసుకొమ్మని చెప్తే ఆమెకు కోపం రాదా మరి. అచ్చంగా అదే జరిగింది.
పూర్తి దిగంబరావతారంలో ఆలయానికి వచ్చిన తనను.. ఇలాగే దర్శనానికి అనుమతించాలంటూ ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగింది. అలా అస్సలు కుదరదని.. అక్కడి పోలీసు సిబ్బంది, అధికారులు స్పష్టం చేయటంతో.. అఘోరీ మాత కోపంతో ఊగిపోతూ తనతో తెచ్చుకున్న కత్తితో అక్కడున్న వారిపై ఆకస్మికంగా దాడి చేసింది. అఘోరీ దాడిలో పలువురికి గాయాలయ్యాయి కూడా. ప్రస్తుతం కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో.. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కాగా.. అఘోరీ మాత హింసాకాండతో అక్కడి భక్తులు ఒక్కసారిగా ఆందోళకు గురయ్యారు.
అయితే.. ముందునుంచి కూడా.. అఘోరి మాతకు ఏం చెప్పినా సరే.. ఇంకేమి అడిగినా సరే.. వింటుంది చెప్తుంది.. ఏమాత్రం కోపగించుకోదు.. కానీ బట్టలేసుకొమని చెప్తే మాత్రం ఎక్కడ లేని కోపంతో ఊగిపోతుంది అందేంటో మరి. ప్రయాగ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచి లక్షల్లో వస్తున్న అఘోరాల్లో చాలా వరకు కాషాయవస్త్రాలు ధరించే కనిపిస్తున్నారు. బహుశా అక్కడక్కడ కొంతమంది దిగంబరులు కనిపిస్తున్నారేమో కానీ.. చాలా వరకు కాషాయం ధరించే జనాల్లోకి వస్తుంటారు. కానీ.. తెలంగాణ అఘోరి మాత్రం ఇలా సింగిల్గా ఊళ్లల్లో తిరుగుతూ దిగంబర దర్శనమిస్తూ.. భక్తులకు మోక్షం కల్పించే కాన్సెప్ట్ ఏంటో జనాలకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa